అఖిల భారత వెలమ సంఘం
డా॥ క్రిష్ణమనేని పాపారావు (పాపన్న) సిద్దిపేట జిల్లాలోని పుల్లూరు గ్రామ వాస్తవ్యులు. వీరి తల్లిదండ్రులు
▸ శ్రీమతి విజయ, స్వర్గీయ క్రిష్ణమనేని వెంకట రామారావు గార్లు. - సిద్దిపేట, సంగారెడ్డి, హైదరాబాద్, కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గాలో విద్యాభ్యాసాన్ని కొనసాగించారు.
▸ 1992 లో గుల్బర్గా విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజనీరింగ్, జెఎన్ యూ నుండి ఎం.టెక్ పూర్తి చేశారు. ప్రముఖ విశ్వవిద్యాలయంలో పిహెచ్.డి పట్టా పొందారు.
▸ 1993 లో పబ్లిక్ సర్వీసెస్ కమీషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నియమించబడ్డారు.
▸ అమెరికాలో ఉద్యోగం చేసి ఎంతో మందికి విద్య, ఉపాధి కోసం సహకారం అందించారు. నీటిపారుదల శాఖలోని వివిధ విభాగాల్లో సేవలందించారు.
▸ ఉమ్మడి రాష్ట్రంలో నీటి పారుదల శాఖలోని తెలంగాణ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు తెలంగాణ నీటి పారుదల శాఖ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడిగా నియమించబడ్డ తర్వాత నాటి ప్రభుత్వ పెద్దలను ఒప్పించి న్యాయం చేకూర్చగలిగారు.
▸ 2005లో డిపార్ట్మెంటల్ బదిలీ ద్వారా రవాణాశాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్గా బాధ్యతలు తీసుకున్నారు.
▸ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారి నాయకత్వంలో పని చేశారు.
▸ తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘాన్ని స్థాపించి ఫౌండర్ సెక్రటరీగా ఉంటూ సంయుక్త కార్యాచరణ కమిటీ ద్వారా నాడు ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతని వివరిస్తూ రాష్ట్రం మొత్తం పర్యటించారు.
▸ మహామహులు ప్రయత్నించినా సాధ్యంకాని తెలంగాణ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్స్ అసోసియేషన్ 2012లో స్థాపించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు అనేక కార్యక్రమాలు చేపట్టి పురపాలక శాఖమంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి చేతులమీదుగా అవార్డు అందుకున్నారు.
▸ తెలంగాణ రాష్ట్ర అవతరణ తరువాత 2016లో ప్రాంతీయ రవాణా శాఖాధికారిగా పదోన్నతి పొందారు. 2019లో ఉప రవాణా కమీషనర్ గా మళ్ళీ పదోన్నతి పొందారు.
▸ పిల్లలకు రోడ్డు నియమాలు, ట్రాపిక్ రూల్స్ సంబంధించిన పరిజ్ఞానాన్ని కలిపించాలనే సదుద్దేశంతో దాదాపు 2 కోట్ల వ్యయంతో కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ నందు వారి నాన్నగారి జ్ఞాపకార్ధంగా స్వర్గీయ క్రిష్ణమనేని వెంకట రామారావు చిల్డ్రెన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్కును నెలకొల్పడం జరిగింది.
వీరి స్వగ్రామం రాజన్న సిరిసిల్లా జిల్లాలోని నేరెళ్ల. ప్రస్తుతం హైదరాబాద్లో స్థిరపడ్డారు. శ్రీ శ్రీనివాస్ రావు గారి సతీమణి శ్రీమతి కొండపల్లి హరిత. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. కుమారుడు తాండ్ర సాత్విక్ అమెరికాలో ఎంఎస్ చేస్తుండగా, కుమార్తె తాండ్ర సరయు మల్లారెడ్డి మెడికల్ కాలేజీ లో మెడిసిన్ చదువుతున్నది. ప్రస్తుతం తెలంగాణ ఐటీ డిపార్ట్మెంట్లో లో డిప్యూటీ ఛీప్ రిలేషన్ ఆఫీసర్ గా పని చేస్తున్నారు. గతంలో ఐసిఐసిఐ ఏరియా మేనేజర్ గా పని చేశారు. గతంలో లయన్స్ క్లబ్ యాక్టివిటీస్ లో పాల్గొన్నారు. ఐవాలో రెండు సార్లు కార్యవర్గ సభ్యుడిగా, ఒకసారి ఆర్గనైజింగ్ సెక్రటరీ గా బాధ్యతలు నిర్వర్తించారు. జెవిఆర్ హాస్టల్ కన్వీనర్. విద్యాదాన నిధికి చైర్మెన్ గా పని చేశారు. వెలమ సమాజంలోని పేద విద్యార్థులకు వాన (వెలమ అసోసియేషన్ ఆఫ్ నార్త్ ఆమెరికా), ఓవా (ఓవర్సీస్ వెలమ అసోసియేషన్) సహాయ సహకారంతో విద్యార్థి దత్తత కార్యక్రమం ద్వారా సహా యాన్ని అందించారు.
జగిత్యాల జిల్లా, కోరుట్ల మండలం, పైడిమడుగు వాస్తవ్యులు. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. బద్రుకా కాలేజీలో గ్రాడ్యువేషన్ పూర్తి చేశారు. 2013- 2018 వరకు ఐవాకి ఈసీ సభ్యుడిగా సేవలు అందించారు. శ్రీశైలం సబ్ కమిటీ కన్వీనర్ గా బ్రహ్మనాయుడు బ్లాక్, VIP కాటేజీలు శంకుస్థాపన దగ్గరినుంచి పూర్తి వినియోగంలోకి తెచ్చే వరకు నిర్విరామ కృషి చేశారు.
M.Sc వృక్షశాస్త్రం, సైకాలజీ, MA ఇంగ్లీష్, MSW & B.Ed లాంటి ఉన్నత విద్యలు అభ్యసించారు. వృత్తిరీత్యా ఖమ్మంలోని బీసీ స్టడీ సర్కిల్ కి డైరెక్టర్ గా పని చేస్తున్నారు. గతంలో 10 సంవత్సరాలు ఖమ్మంలోని పేరుగాంచిన పాఠశాల, ఇంటర్ కళాశాలకు ప్రిన్సిపాల్ గా పని చేశారు. గతంలో ఐవా మహిళా సబ్ కమిటీ మెంబర్గా, ఐవా హైదరాబాద్ గర్ల్స్ హాస్టల్ కన్వీనర్ గా పని చేశారు. ఖమ్మం జిల్లా పద్మ నాయక వెలమ అసోసియేషన్ ఈసీ మెంబర్ గా వెలమ సమాజానికి సేవలు అందించారు.
వీరు పెద్దపల్లి జిల్లా, రామగుండం మండలం, మేడిపల్లి గ్రామానికి చెందిన శ్రీ పురుషోత్తం రావు, శ్రీమతి భాగ్యలక్ష్మి గార్ల కుమారుడు. ఎంబిఏ పూర్తి చేసి.. ప్రస్తుతం సురభి హోటల్స్ డైరెక్టర్గాగా పని చేస్తున్నారు. 2013-15, 2015-18 ఐవా ఎన్నికలలో ఈసీ సభ్యుడిగా అత్యధిక మెజారిటీ తో రెండు సార్లు గెలుపొందారు. 2013 నుండి 2018 వరకు విద్యాదాన నిధి కన్వీనర్గా పని చేశారు. వీరి సతీమణి శ్రీమతి స్రవంతి. ఈ దంపతులకు ఇక కుమారుడు హృదయ్ ఉన్నారు.
స్వర్గీయ రామారావు, కమలమ్మ గార్ల కుమారుడు వీరు. వీరి సతీమణి శ్రీమతి వనిత. వీరికి ఇద్దరు కుమార్తెలు శ్రీకరి. శార్వరిలున్నారు. సాయి మారుతి కన్స్ట్రక్షన్స్ మెనేజింగ్ పార్ట్నర్ గా చేసి 32 ఏళ్లుగా నిర్మాణ రంగంలో ఉన్నారు. ప్రస్తుతం డివైన్ హెూమ్స్ మేనేజింగ్ డైరెక్టర్గా పని చేస్తున్నారు. బౌరంపేటలోని వి.ఎన్.ఆర్ ఓల్డ్ ఏజ్ హోమ్ కి సబ్ కమిటీ సభ్యుడిగా సేవాకార్యక్రమాల్లో ఉన్నారు. ఐవా మాజీ అధ్యక్షులు స్వర్గీయ వడ్డేపల్లి నర్సింగ రావు గారి సోదరుడు.
పాత్పైండర్ విద్యాసంస్థల సెక్రెటరీ, కరెస్పాండెంట్ గా ఉన్నారు. లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 320F కి ఈ సంవత్సరం మొదటి వైస్ చైర్మన్ గా ఉన్నారు. TRSMA వరంగల్ జిల్లా అధ్యక్షుడు. ప్రస్తుత ఉమ్మడి వరంగల్ జిల్లా వెలమ సంక్షేమ సంఘం ఈసీ మెంబర్ గా ఉన్నారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డులు అందుకున్నారు, ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేశారు. లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1997 నుండి పాత్ండర్ ఎంట్రన్స్ కాలేజీ ద్వారా చాలా మంది విద్యార్థులు స్టేట్ ర్యాంకులు మరియు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు, SI, గ్రూప్-2 ఉద్యోగాలు పొందారు.
వీరు శ్రీ వేనేపల్లి సుదర్శన్ రావు, శ్రీమతి వనజగార్ల కుమార్తె. నాగర్ కర్నూల్ జిల్లా, తిప్పారెడ్డి పల్లికి చెందిన శ్రీ కోట్ల సుదర్శన్ రావు గారి సతీమణి. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు యోశిత్ రాయ్, వర్శిత్ రాయ్లున్నారు. వీరు ఐవా మహిళా కమిటీ మెంబర్ గా, కార్యవర్గ (ఇసి) సభ్యురాలుగా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే ఐవా మ్యారేజ్ అసిస్టెన్స్ సెల్ కన్వీనర్ గా సేవలందించారు.
జగిత్యాల జిల్లా బీర్పూర్ గ్రామంలో 1965 జూన్ 1న శ్రీ బల్మూరు ఆగమరావు, విమలాదేవి దంప తులకు జన్మించిన వీరు హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణ రంగంలో స్థిరపడ్డారు. వీరి విద్యా భ్యాసమంతా కరీంనగర్ లోనే పూర్తి చేశారు. ఒక పక్క బిల్డర్గా స్థిరపడినప్పటికీ మరోపక్క సంఘ కార్యమాలలో పాలుపంచుకుంటూ జెవిఆర్ బాలుర వసతి గృహ సబ్ కమిటీలో సభ్యునిగా 2018 -22 కాలపరిమితికి ఐవా ఇసి మెంబర్ గా తన సేవలందించారు.
వీరు మెదక్ జిల్లాలోని మంగల్పర్తి గ్రామానికి చెందిన శ్రీమతి & శ్రీ శ్రీనివాస్ రావు, విజయలక్ష్మి గార్ల కుమారుడు. వీరు ప్రస్తుతం హైదరాబాద్లోని అల్వాల్లో స్థిరపడి, కన్స్ట్రక్షన్ బిజినెస్ లో రాణిస్తున్నారు. వీరి సతీమణి శ్రీమతి పద్మజ. ఈ దంపతులకు ఒక కుమారుడు క్రితిమన్, ఒక కుమార్తె అక్షితలున్నారు. శ్రీ కేశవ రావు గారు గతంలో అఖిల భారత వెలమ సంఘం ఇసి మెంబర్ గా సేవలందించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండలంలోని గూడెం గ్రామ వాస్తవ్యులైన స్వర్గీయ సుధాకర్ రావు, శ్రీమతి రమాదేవి దంపతుల కుమారుడు. వీరి నాన్నగారు రైసుమిల్లు వ్యాపారంలో పేరుగాంచారు. శ్రీ సంజీవరావు కన్స్ట్రక్చన్ మెటిరియల్ సప్లైతో పాటు, సిరిసిల్లలో ఇండియన్ ఆయిల్ డీలర్గా, ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్గా ఉన్నారు. వీరి సతీమణి శ్రీమతి దీప్తితో పాటు ఇద్దరు కుమార్తెలు అనునిత, దృవిక లున్నారు. ఆరు సంవత్సరాలుగా సిరిసిల్ల వెలమ సంఘం కార్యవర్గంలో మెంబర్గా సేవలందించారు.
ఓయూ ద్వారా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కేబుల్, బ్రాడ్ బ్యాండ్ సేవల్లో 25 సంవత్సరాల అనుభవం. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు గౌరవ అధ్యక్ష పదవిలో ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీకి అధ్యక్షుడు. అభ్యాస్ స్కూల్ కరస్పాండెంట్. ఎన్నో సేవ కార్యక్రమాల్లో ఉన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా, వంగూరు మండలంలోని కోనేటిపురం గ్రామ వాస్తవ్యులైన శ్రీమతి & శ్రీ తిరుపతమ్మ, చలపతి రావుల కుమారుడు. వృత్తిపరంగా వ్యాపారంలో స్థిరపడిన వీరు గత 20 సంవత్సరాలుగా సామాజిక, రాజకీయ రంగాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షునిగా, జెడ్పిటిసి అభ్యర్తిగా వివిధ హోదాలలో సేవలందించారు. ప్రస్తుతం వీరు హైదరాబాద్లో స్థిరపడ్డారు. వీరికి సతీమణి శ్రీమతి గీత, కుమార్తె అక్షరలున్నారు.
వీరు జగిత్యాల జిల్లాలోని శకల్ల గ్రామానికి చెందిన శ్రీమతి & శ్రీ అల్లాడి అమ్మాయి, ప్రభాకర్ రావుల కుమారుడు. వీరి సతీమణి శ్రీమతి స్వాతి. ఈ దంపతులకు ఒక సంతానం రియాన్షి రావు ఉన్నారు. ప్రస్తుతం శ్రీ రాజేందర్ రావు హైదరాబాద్లో వ్యాపారరంగంలో స్థిరపడ్డారు. వివా 2018-22 విద్యా దాననిధి సబ్ కమిటీలో మెంబర్ సేవలందించారు.
వీరు కరీంనగర్ జిల్లా, రామడుగు మండలంలోని వెదిర గ్రామానికి చెందిన శ్రీమతి & శ్రీ చెన్నమనేని ఇందిరా, కిషన్ రావు దంపతులకు జన్మించారు. వీరు లెటరైట్ గనుల వ్యాపారంలో స్థిరపడ్డారు. వీరికి సతీమణి శ్రీమతి అమిత, కుమారుడు రితిన్ లున్నారు. వీరు గత కార్యవర్గంలో ఇసి మెంబర్గా ఉండడమే కాకుండా శ్రీశైలం సబ్ కమిటీ ద్వారా హితోదిక సేవలందించారు.
ఓయూ ద్వారా పెర్సనల్ మేనేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యువేషన్ పూర్తి చేశారు. ఆగ్రో కెమికల్ ఇండస్ట్రీ పసుర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రమోటర్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం M/S జాస్మిన్ బయో ల్యాబ్స్ Pvt ltd కి డైరెక్టర్ గా పని చేస్తున్నారు.
నిజామాబాద్ జెడ్పీ చైర్మెన్ శ్రీ దాదన్నగారి విఠల్ రావు, శ్రీమతి అనసూయ దంపతుల పుత్రుడు. వీరి సతీమణి శ్రీమతి గౌతమి రావుతో పాటు కుమార్తె సహస్ర రావు, కుమారుడు సుహాస్ రావులున్నారు. ఐ.జి.ఎన్.ఏ.యూ ద్వారా ఎంసిఏ పూర్తి చేసి ఆహార మరియు నిర్మాణ రంగ వ్యాపారవేత్తగా ఉన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మెంబర్ 2 సంవత్సరాలు సేవలందించి యువ ఆటగాళ్ళను ప్రోత్సహించారు.
మంచిర్యాల జిల్లా వాస్తవ్యులు శ్రీమతి & శ్రీ గోనే రమాదేవి, సుర్యారావుల కుమారుడు వీరు. వీరికి సతీమణి శ్రీమతి రూపతో పాటు ఇద్దరు సంతానం అనేక్ రావు, మితిరావులు కలరు. భవన నిర్మాణ రంగంలో పుష్య అమృత కన్స్ట్రక్షన్స్ ద్వారా 20 సంవత్సరాలు అనుభవం కలదు. 8 ఏళ్ళుగా దుబాయ్ లో పెన్నార్ ఎలెక్ట్రో మెకానికల్ వర్క్స్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బాలాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు.
బ్యాంకు ఉద్యోగిగా పదవి విరమణ పొందారు. నల్గొండ మరియు సూర్యాపేట జిల్లాలో అనేక అసోసియేషన్ కార్యక్రమాలలో పాల్గొని సేవలందించారు మరియు AIVA సభ్యత్వాన్ని నమోదు చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. వెలమ చౌల్ట్రీ శ్రీశైలంలో సర్కమిటీ సభ్యునిగా పనిచేశారు
కరీంనగర్ జిల్లా, చేగుర్తి గ్రామంలో శ్రీ బల్మూరి కొండల్ రావు, శ్రీమతి సావిత్రి దంపతులకు 1970 జులై 1న జన్మించిన శ్రీ బల్మూరి ఆనంద్ రావు 2018 22 కార్యవర్గంలో ఇసి మెంబర్గా సేవ చేశారు. కరీంనగర్ వెలమ సంక్షేమ మండలిలో రెండుసార్లు కార్యవర్గ సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తిం చారు. నగునూర్ ఎస్.ఆర్.ఎస్.పి డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మెన్గా 6 సంవత్సరాలు రైతాంగ సేవలో తరించారు. 2013 నుండి 18 వరకు చేగుర్తి గ్రామ సర్పంచ్గా వీరు సేవలందించారు.
రాజన్న సిరిసిల్లా జిల్లా, ముస్తాబాద్ మండలం, గూడెం గ్రామంలో 1971 ఆగష్టు 12న స్వర్గీయ గన్నమ నేని కమలాకర్ రావు, శ్రీమతి సువర్ణ దంపతులకు జన్మించారు. వీరి సతీమణి శ్రీమతి వనజ. వీరికి ఒక కుమార్తె అనన్య ఉన్నారు. ఎంబిఏ పట్టా పుచ్చుకున్న శ్రీ కృష్ణ ప్రవీణ్ రావు కొంతకాలం ప్రైవేట్ కంపెనీలో పని చేశారు. తర్వాత తానే స్వతహాగా కంపెనీని స్థాపించారు. సిరిసిల్ల పద్మనాయక వెలమ సంఘం లో రెండు సార్లు ఇసి మెంబర్ సేవలందించారు. గత ఐవా కార్యవర్గంలో ఇసి మెంబర్గా ఉన్నారు.
నల్గొండ జిల్లా, తిర్మలాపూర్ మండలం చింతపల్లి గ్రామానికి చెందిన ఉజ్జిని కిషన్ రావు తన గ్రాడ్యు యేషన్ తర్వాత సివిల్ కాంట్రాక్టర్గా చేస్తున్నారు. అంతేకాకుండా "నీలగిరి ఫౌండేషన్" అన్న పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ (ఎన్.జి.ఓ) ను నడిపిస్తున్నారు. వీరి భార్య శ్రీమతి సరిత. వీరికి ఒక కుమారుడు అభిరామ్ ఉన్నారు.
నల్గొండ జిల్లా, చండూరు మండలంలోని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన శ్రీ హనుమంత రావు, స్వర్గీయ ఇందిరమ్మ గార్ల కుమారుడు. వీరికి భార్య శ్రీమతి స్వాతితో పాటు, కుమార్తె శ్రీనిధి ఉన్నారు. శ్రీ యత్తపు మధుసూదన్ రావు సిటీ కాలేజీలో చదివి డిగ్రీ పట్టా తీసుకున్నారు. ఆ తర్వాత నిర్మాణ సంస్థలో భాగస్వామిగా చేరి 25 సంవత్సరాల అనుభవాన్ని గడించడమే కాకుండా విజయవంతంగా బిల్ద స్థిరపడ్డారు.
సుజాత కాలేజి నాంపల్లిలో MSc బయోటెక్నాలజీ పూర్తి చేశారు. ఒక గృహిణిగా... తన భాధ్యతలు నిర్వర్తిస్తూనే, శ్రీ సరస్వతి శిశుమందిర్ పూర్వ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా సేవలు అందిస్తున్నారు. బాల సంస్కార కేంద్రాల ద్వారా శిశు సంక్షేమ కార్యక్రమాలు, మహిళా సాధికారత రంగాలలో విస్తృతంగా పని చేస్తున్నారు.
వీరు ఐవా మ్యారేజ్ బ్యూరో ద్వారా వెలమ సమాజానికి అనేక సేవలందించిన నిర్మల్ వాస్తవ్యులు స్వర్గీయ జోగినిపల్లి సుధాకర్ రావు గారి కుమార్తె. వీరి భర్త శ్రీ పడకంటి భూషన్ రావు. ఈ దంప తుల కుమారుడు రాఘవ. వీరంతా హైదరాబాద్లో స్థిరపడ్డారు. శ్రీమతి షర్మిలగారు వివా మహిళా సబ్ కమిటీ చైర్ పర్సన్గా సేవలందించారు.
వీరు కోదాడ మాజీ శాసన సభ్యులు శ్రీ వేనేపల్లి చందర్ రావు, శ్రీమతి నిర్మల కుమార్తె. ఉదయ శ్రీ గారి భర్త చింతల సురేందర్ రావు కాంట్రాక్టర్ స్థిరపడ్డారు. ఈ దంపతులకు ఒక కుమారుడు చింతల రమేష్ చంద్ర, కోడలు హారిక రావు, కుమార్తె డా॥ కోమండ్ల అనుహ్య, అల్లుడు శివరామ రావు లున్నారు. శ్రీమతి ఉదయశ్రీ గారు గృహిణిగా తన బాధ్యతలు నిర్వహిస్తూ ఖమ్మం జిల్లా వెలమ సంఘం మహిళా కమిటీ వైస్ ప్రెసిడెంట్గా సేవలందించారు.